Wednesday, February 15, 2012

ravi-teja-puri-film-launch-on-17th


మరో రెండు రోజుల్లో రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’


సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభం కానుంది. పూరి ఆఫీస్ లోనే ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణ జరుగనుంది. మార్చి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూరి ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రవితేజ-పూరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు భారీ విజయం సాధించాయి. నేనింతే సినిమా మాత్రం నిరాశ పరిచింది.‘దేవుడు చేసిన మనుషులు’ ఈ ఇద్దరి కాంబినేషన్లో వయస్తున్న 5వ సినిమా. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానాను ఎంపిక చేశారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ఈ సినిమా ప్రారంభం రోజు రవితేజ నటించిన ‘నిప్పు’ చిత్రం విడుదలవుతుండటం విశేషం. ప్రస్తుతం రవితేజ ‘దరువు’ చిత్రంలో నటిస్తున్నాడు. శౌర్యం ఫేం శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక.

No comments:

Post a Comment