Wednesday, February 15, 2012

naga-chaitanya-gouravam-halted


నాగచైతన్య ‘గౌరవం’ఇప్పుడు లేనట్లేనా?


అక్కినేని యువ హీరో నాగచైతన్య హీరోగా రాధామోహన్ దర్శకత్వంలో ‘గౌరవం’ అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించారు. నాగార్జున తన సొంత బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యాడు కూడా. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వరుస ప్లాపులతో ఉన్న నాగ చైతన్య మరో నాలుగైదు కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు చేసి కెరీర్ గాడిలో పడ్డ తర్వాత ‘గౌరవం’ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాధా మోహన్ దర్శకత్వం వహించే ‘గౌరవం’ సినిమా క్లాస్ పీపుల్ మాత్రమే చూసే సినిమా కావడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చక పోవచ్చని,అందుకే కొంత గ్యాప్ తీసుకోవాలని చైతు నిర్ణయించుకున్నాడట.

ప్రస్తుతం నాగచైతన్య ఆటోనగర్ సూర్య చిత్రంలో షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి దేవ కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. ఇదే కాక నాగచైతన్య, దర్శకుడు వీరూ పోట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది. గతంలో వీరూ పొట్ల నాగార్జునతో ‘రగడ’, మనోజ్ తో ‘బిందాస్’ చిత్రాలు రూపొందించారు. ఈ రెండు సినిమాలు బాక్సీఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించాయి. ఈ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వీరూ పొట్ట నాగచైతన్యతో మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment