Monday, February 20, 2012

pawan-targets-which-tv-channel


హాట్ టాపిక్: పవన్ టార్గెట్ ఏ టీవీ ఛానెల్ ?


పవన్ కళ్యాణ్ త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కెమెరామెన్ గంగతో రాంబాబు అనే టైటిల్ తో పూరీ జగన్నాధ్ రూపొందించే ఈ చిత్రం ఏ టీవీ ఛానెల్ ని టార్గెట్ చేయనున్నారనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ లో నే కాక మీడియా సర్కిల్స్ లో కూడా ఈ విషయమై తీవ్రంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ ని మాటల్ని వక్రీకరించి నెగిటివ్ గా ఓ ఛానెల్ చూపించిందని దానిపై ద్వజమెత్తనున్నారనే రూమర్స్ గుప్పుమంటున్నాయి. అయితే గతంలోనూ పూరీ తన సినిమాల్లో మీడియాను ఓ రేంజిలో ఏకి పారేయటంతో ఇప్పుడు కూడా అదే ఘాటుతో విరుచుకుపడతాడా అంటున్నారు. నేనింతే తరహాలో పూర్తిగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసి డైలాగులు రాసాడని చెప్పుకుంటున్నారు. ఇక మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment